ఆంధ్రప్రదేశ్ లో దేవాలయాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం అలసత్వం వలనే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కాగా, దీనిపై దేవాలయాలపై దాడుల విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందించారు. దేవాలయాలపై దాడులు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని అన్నారు. మళ్ళీ ఇలాంటి దాడులు చేయడానికి భయపడాలని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ జరుగుతోందని అన్నారు. అర్ధరాత్రి అందరూ పడుకున్నాక దేవాలయాలపై దాడులు చేస్తున్నారని, దాడులు చేస్తున్నవారే మళ్ళీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని అన్నారు. దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని, దీనిద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారని జగన్ మండిపడ్డారు. రాజకీయ లబ్దికోసం ఇలాంటి పనులు చేసేవారికి గుణపాఠం చెప్పాల్సిందే అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. గుళ్ళు,గోపురాలు రక్షించుకునే కార్యక్రమాలు చేస్తున్నట్టు జగన్ తెలిపారు. నిందితులు ఎంతటివారైనా సరే వదిలేది లేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post