telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

రాహుల్‌కు వ్యవసాయం అంటే తెలుసా?: కిషన్‌రెడ్డి

BJP Kishan Reddy Says Threatening Calls
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్‌కు వ్యవసాయం అంటే తెలుసా అని ప్రశ్నించారు? కనీసం పాలు బర్రె నుంచి వస్తాయా.. దున్నపోతు నుంచి వస్తాయా అనేది కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అందరి మన్ననలు పొందుతోందని అన్నారు. 
మోదీ ప్రభుత్వం పారదర్శకంగా, జవాబుదారీతనంతో పనిచేస్తోందని ఆయన అన్నారు.మోదీ ప్రజాకర్షక బడ్జెట్‌ను జీర్ణించుకోలేక కొందరు అనవరస ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆదాయపన్ను పరిమితి పెంచడం మధ్యతరగతికి ఉపశమనం కల్గిస్తుందని చెప్పారు. బడ్జెట్‌లో తెలంగాణకు అధిక ప్రాధాన్యమిచ్చారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Related posts