telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పింక్” రీమేక్ విషయమై నిర్మాతలపై పవన్ ఫైర్

Pawan

2018లో విడుద‌లైన `అజ్ఞాత‌వాసి` త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌ళ్లీ సినిమాల్లో న‌టించ‌లేదు. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మ‌ళ్లీ ప‌వ‌న్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌నున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్‌లో విజ‌యవంత‌మైన `పింక్‌` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. దిల్‌రాజు, బోనీక‌పూర్ నిర్మాత‌లుగా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. సినిమా సెట్స్ పైకి వెళ్లే లోపు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేసుకోవాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావిస్తున్నారు. అందులో భాగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ట‌.ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నయనతార, తమన్నా, పూజా హెగ్డే‌ను తీసుకోవాలన్న బోనీ కపూర్ సూచనలపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అయినట్టు సమాచారం. అసలు నా పర్మిషన్ తీసుకోకుండా… ఈ ప్రాజెక్ట్‌ను ఎలా అనౌన్స్ చేస్తారని మండిపడ్డట్టు సమాచారం. మరోవైపు ఈ సినిమా కోసం నేను.. రూ.50 కోట్లు పారితోషకం తీసుకున్నట్టు వస్తున్న వార్తలపై కూడా సీరియస్ అయినట్టు సమాచారం. అంతేకాదు తన కెరీర్‌లో ఏ నిర్మాతను ఎప్పుడూ రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెట్టలేదు. అలాంటి తన వ్యక్తిత్వంపై నెగిటివ్ ఇంపాక్ట్ కలిగేలా చేసిన ఈ పారితోషకం వార్తలను ఎందుకు ఖండించలేదని పవన్.. బోనీ కపూర్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. మరోవైపు ‘పింక్’ సినిమా చూసి ఈ కథ తనకు నచ్చింది అని చెప్పాను… కానీ ఈ రీమేక్‌లో నటిస్తానని చెప్పలేదని, కేవలం ఆలోచిస్తాను అని చెప్పిన దాన్ని ఆధారంగా చేసుకొని తాను ఈ రీమేక్‌లో నటిస్తున్నట్టు ఎందుకు ప్రచారం చేసారని దిల్ రాజు, బోనీ కపూర్‌లపై మండిపడ్డట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలన్ని త్రివిక్రమ్ దృష్టికి వరకు వెళ్లినట్టు తెలుస్తోంది. ‘అల వైకుంఠపురములో’ సినిమా షూటింగ్ కోసం ఫారిన్‌లో ఉన్న త్రివిక్రమ్.. తాను తిరిగొచ్చాక పవన్ కళ్యాణ్‌ను కలిసి ఆయన మనుసులో సినిమా చేయాలనుందో లేదో తెలుసుకుంటానిని చెప్పాడని అంటున్నారు.

Related posts