బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఎంతలా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తరువాత సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్తో రూపొందుతున్నభారీ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో”. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ లో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ బైక్ రైడింగ్ కి సంబంధించిన సన్నివేశాలను కొంతకాలం క్రితం షూట్ చేశారు. ఆ బైక్ కి సంబంధించిన ఫోటో బయటకు రావడంతో, దాని గురించి తెలుసుకోవడానికి అభిమానులు ప్రయత్నించారు.
ఈ సినిమా కోసం ప్రభాస్ “ట్రిమ్ప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్” అనే బైక్ ను ఉపయోగించాడు. 765 సీసీ లైన్ త్రీ సిలిండర్ ఇంజన్ ద్వారా ఈ బైక్ కి పవర్ సప్లై అవుతుందట. ఈ బైక్ టాప్ లైన్ మోడల్ ధర (ఎక్స్ షోరూమ్ ధర) 10.55 లక్షలని సమాచారం. ఈ మోడల్ బైక్ ను ఇంతకుముందు బాలీవుడ్ లో, “మిషన్ ఇంపాజిబుల్”తో పాటు పలు హాలీవుడ్ సినిమాల్లోనూ ఉపయోగించారట. ఈ బైక్ ప్రభాస్ కు విపరీతంగా నచ్చేయడంతో దానిని తన సొంతానికి వాడుకునేందుకు ఇంటికి తీసుకెళ్లాడని అంటున్నారు.
ఇక ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కోసం పాప్ గాయనిగా వరల్డ్వైడ్గా పేరు ప్రఖ్యాతలు పొందిన బ్రిటీష్ భామ కైలీ మినోగ్ ను తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఇండియాలో పలు భాషాల్లో భారీ స్థాయిలో విడుదల చేయడమే కాకుండా జపాన్ లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్లు నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నీల్ నితిన్ ముకేశ్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, ఎవ్లిన్ శర్మ, చుంకీ పాండే వంటి స్టార్స్ కీలకమైన పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.
పాప పోలిక విషయమై సమీరారెడ్డిపై విమర్శలు