“బాహుబలి” చిత్రం తర్వాత ప్రభాస్ నటిస్తున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “సాహో”. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. నీల్ నితిన్ ముఖేశ్, ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ, చుంకీ పాండే, లాల్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. శంకర్ ఎహసాన్ లాయ్ తప్పుకున్న తర్వాత ఈ చిత్రానికి జిబ్రాన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 30న విడుదల కానుంది. “సాహో” చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ, మళయాల భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఇక చిత్ర రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ వినూత్నమైన ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇప్పటికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్తో పాటు పోస్టర్స్, సాంగ్స్ విడుదల చేశారు. వీటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి భారీ బిజినెస్ జరుగుతోంది. సాహో చిత్ర ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, ఆగస్ట్ 10న ట్రైలర్ విడుదల కానుందంటూ పోస్టర్ ద్వారా తెలిపింది చిత్ర నిర్మాణ సంస్థ. ఈ నేపథ్యంలో ‘సాహో’ సినిమాలోని తొలి పాటకు సంబంధించిన ఓ స్టిల్ను శ్రద్ధ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ఎరుపు రంగు గౌనులో, మంచు కొండల్లో, కాళ్ల దగ్గర పొగలు వస్తున్నట్లుగా ఆ ఫొటోను తీశారు. అయితే ఈ ఫొటోను చూసిన అర్జున్.. “ఆ రియాక్షన్ ఏంటి.. గట్టిగా తుమ్మినట్లు…” అని చమత్కరించారు. ఈ కామెంట్కు దాదాపు రెండు వేలకు పైగా లైక్లు వచ్చాయి.
previous post
next post