భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి(సి.వి.ఎం), యష్ రంగినేని సంయుక్తగా నిర్మించారు. జూలై 26న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలు పోషించిన విషయం విదితమే. తొలి రోజు ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్ సంస్థపై ఈ చిత్రాన్ని రీమేక్ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హిందీ రీమేక్ కోసం కరణ్ జోహార్ రూ.6.2 కోట్లు ఇచ్చి రైట్స్ని సొంతం చేసుకున్నాడని అన్నారు. తాజాగా “డియర్ కామ్రేడ్” హిందీ రీమేక్ కు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమా రీమేక్కు బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ను ఎంపికచేసుకోవాలని కరణ్ అనుకున్నారట. సినిమా కోసం షాహిద్ రూ.40 కోట్లు పారితోషికంగా అడిగినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు ఈ రీమేక్లోనే నటించనని షాహిద్ అన్నారట. ఈ మేరకు బాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది.
previous post