telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కృష్ణా జిల్లాలో టీడీపీకీ షాక్.. వైసీపీలో చేరిన దేవినేని అవినాష్‌

Devineni-Avinash jagan

కృష్ణాజిల్లాలో టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన దేవినేని అవినాష్‌ గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో దేవినేని అవినాష్‌తో పాటు టీడీపీ సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు వైఎస్సార్‌ సీపీలో చేరారు. వారిద్దరికీ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అవినాష్‌ ఇవాళ తెలుగుదేశం పార్టీతో పాటు తెలుగు యువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు.అవినాష్‌ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది.

Related posts