telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మెగాస్టార్ ఆ సినిమా కూడా మొదలైందా…?

chiranjeevi on cine musical night

ప్రస్తుతం ఆచార్య సినిమా చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవి బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆచార్య ముగిసిన వెంటనే చిరు, మెమర్ రమేష్ దర్శకత్వంలో ఓ సినిమా పట్టాలెక్కనుందని అందరూ భావించారు. తమిళ స్టార్ హీరో అజిత్, శ్రుతి హాసన్ నటించి వేదాళం సినిమాను తెలుగులోకి రీమెక్ చేయనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఇంకా సమయం ఉంది. ఈ సినిమా షూటింగ్‌పై ఇంకా అధికారికంగా ఎటవంటి ప్రకటన కూడా రాలేదు కానీ ఇప్పుడు ఈ సినిమాపై పరిశ్రమలో కొన్ని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు మెహర్ రమెష్ వేదాలం రీమేక్ షూటింగ్‌ను ఇప్పటికే మొదలు పెట్టాడని, కథ ప్రకారం కలకత్తా బ్యాక్ డ్రాప్‌లో మెగా స్టార్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్నున్నాడని వార్తలు వచ్చాయి. మరి ఇది ఎంతవరకు నిజమనేది చిరునే చెప్పాలి. అయితే మెహర్ రాజా ఈ స్క్రిప్ట్‌ కోసం దాదాపు మూడు సంవత్సరాలు కష్టపడ్డాడు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కావలసిన మార్పులు  చేశాడు. అంతేకాకుండా చిరును దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల సెంటిమెంట్లను సరిగ్గా ఉండేలా చూసుకున్నాడు. కానీ ప్రస్తుతం చిరంజీవీ కొరటాల శివా దర్శకత్వంలో ఆచార్య చేస్తన్నాడు. ఇందులో రామ్ చరణ్‌ కూడా కీలక పాత్ర చేయనున్నాడు. దీనితో పాటు చిరు షెడ్యూల్‌లో లూసిఫర్ రీమెక్ కూడా ఉంది. ఈ సినిమాకు ఇంకా దర్శకుడు సెట్ అవ్వలేదు. దానితోపాటు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడినికి చిరు పచ్చజెండా ఊపాడు. ఇదిలా ఉంటే వేదాళం సినిమా షూటింగ్‌లో చిరు ఎప్పటి నుంచి పాల్గొంటాడో చూడాలి మరి.

Related posts