గత కొన్నిరోజులుగా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయాన్ని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ అమెరికా నుంచి కూడా తనకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని వివరించారు. రేయ్ ఏమనుకుంటున్నావురా… నిన్ను లేపేస్తాం అంటూ మాట్లాడుతున్నారని తెలిపారు.
వాళ్ల ఫోన్ నెంబర్లన్నీ తన వద్ద ఉన్నాయని అన్నారు. ఒకవేళ కంప్లెయింట్ చేస్తే, అక్కడ పేరు చివర రెండక్షరాల సామాజిక వర్గం వాళ్లు ఉంటే న్యాయం జరగదన్న ఉద్దేశంతో ఆగిపోతున్నానని వివరించారు. నిన్న ఒకడు, ఇవాళ మరొకడు కూడా బెదిరిస్తూ ఫోన్ చేశారు. నా ఇంటి వద్దకు రండి… మిమ్మల్నిసీఆర్పీఎఫ్ వాళ్లు కాల్చిపడేస్తారని మండిపడ్డారు.
తెలంగాణలో నడ్డా మాటలు కార్యరూపం దాల్చలేదు: పొన్నం ప్రభాకర్