telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వృద్ధురాలికి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు..

KTR

ఈరోజు ఉదయం 7 గంటలకే గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యాయి. కానీ గ్రేటర్‌ ఎన్నికల్లో ఓటేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపడం లేదు. మధ్యాహ్నం 12 గంటలు అవుతున్నా పోలింగ్‌ శాతం 20 శాతం కూడా దాటలేదు. ఈ పోలింగ్‌ కు తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా ఓటర్లు ఇళ్లలోనే ఉండిపోయారు. పోలింగ్‌ బూత్ లు విలవిలలాడిపోతున్నాయి.  హైదరాబాద్‌ ఎన్నికల్లో ఓటేసేందుకు యువతరం ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో 80 ఏళ్ల ఓ వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకుని గర్వంగా నిలిచింది. లాక్‌ డౌన్‌ తర్వాత తొలిసారి బయటకు వచ్చిన ఆ వృద్ధురాలు ఇవాళ ఉదయం జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓటేసింది. ఈ విషయాన్ని ఆమె మనవరాలు ట్విట్టర్‌లో కేటీఆర్‌ను ట్యాగ్‌ చేస్తూ పోస్ట్‌ చేసింది. ఈ పోస్ట్‌పై మంత్రి కేటీఆర్‌ వెంటెనే స్పందించారు. ఆ వృద్ధురాలికి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగానే ధన్యవాదాలు చెప్పారు. ఓటేయకుండా కేవలం కంప్లయింట్లకు పరిమితం అయ్యే వారికి ఆమె ఓ స్ఫూర్తి అని పేర్కొన్నారు కేటీఆర్‌. అయితే ఈ పోలింగ్ పై ప్రజలు ఎవరు అతగా ఆససక్తి చూపించడంలేదు.

Related posts