వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. ఎప్పడూ ఎదో వివాదాలతో వార్తల్లో నిలిచే వర్మ ఈసారి సరికొత్తగా ప్లాన్ చేశాడు..హిందు దేవుళ్లపై నిరంతరం ఎదో ఒక లాజిక్ తో కాంట్రవర్సీ క్రియేట్ చేసే వర్మ ఈసారి ఏకంగా అమ్మవారికి నైవేద్యంగా మందు బాటిల్ ను తీసుకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది.
వాస్తవిక సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య.. ఇప్పటికే ‘రక్త చరిత్ర, మర్డర్, సర్కార్, లక్ష్మీస్ ఎన్టీఆర్’ వంటి నిజ జీవిత సంఘటనలు సినిమాగా రూపొందించారు.
తెలంగాణ రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న‘కొండా’ దంపతుల జీవితాలను తాజాగా ‘కొండా’ తెరకెక్కించబోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రారంభోత్సవం రోజు నాడే ఓ వింత పని చేసి హాట్ టాపిక్ అయ్యాడు వర్మ.
వరంగల్ లోని వంచనగిరి ఊరులో ‘కొండా’ మూవీ ప్రారంభోత్సవం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా ఆర్జీవి అక్కడి గండి మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించాడు. అలాగే అక్కడ సంస్కృతిని ఫాలో అవుతూ గండి మైసమ్మ అమ్మవారికి మందు తాగించి అమ్మవారి ఆశీస్సులు అందుకున్నాడు.
అనంతరం అక్కడి వంచనగిరి గ్రామంలో సినిమా షూటింగ్ ప్రారంభించాడు. దీనికి సంబంధించిన పోస్టర్ను రీసెంట్గా ఆర్జీవీ విడుదల చేశారు. 1980 లవ్స్టోరీ విత్ నక్సల్ బ్యాగ్రౌండ్తో సినిమా రూపొందనుంది. అరుణ్ అదిత్ ఇందులో కొండా మురళి పాత్రలో కనిపించబోతున్నాడు. భైరవగీత ఫేమ్ ఇర్రా మోర్ కొండా సురేఖ పాత్రలో కనిపించనున్నారు.