కొన్నేళ్లుగా కామెడీకి కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా వెండితెర ప్రయాణం కొనసాగించిన ఈ హాస్య బ్రహ్మ.. ఈ మధ్య కాలంలో సినిమాలు చేయడం తగ్గించారు. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో వస్తున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయనది ట్రాజెడీ రోల్ అని తెలుస్తోంది. మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’కి ఇది రీమేక్గా ప్రకాశ్రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో ఈ మూవీ రూపొందుతోంది. ఇక లాక్డౌన్ కారణంగా గత కొన్నినెలలుగా ఇంటికే పరిమితమైన బ్రహ్మానందం.. కొద్ది రోజుల క్రితమే కరోనాపై అద్భుతమైన చిత్రం గీసి అందరిని దృష్టిని ఆకర్షిస్తూ తనలో ఉన్న చిత్రకళను ఆవిష్కృతం చేశారు. ఈ క్రమంలోనే అయోధ్యలో రామ మందిర భూమి పూజ సందర్భంగా మరోసారి తన ట్యాలెంట్ చూపిస్తూ శ్రీరాముడి స్కెచ్ వేశారు బ్రహ్మి. ”ఆంజనేయుని ఆనంద భాష్పాలు” అని పేర్కొంటూ శ్రీ రాముడిని ఆలింగనం చేసుకుని ఆంజనేయుడు తన్మయత్వంతో కన్నీళ్లు కారుస్తున్న అద్భుత చిత్రాన్ని గీసి ఆడియన్స్ని ఫిదా చేశారు. అయోధ్యలో రాముడికి గుడి కడుతున్న సందర్భంగా హనుమంతుడు ఆనందపడుతున్నట్లు బ్రహ్మానందం గీసిన ఈ స్కెచ్ పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
previous post