telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎన్నికల సంఘం చర్యలు తీసుకోకపోవడం దారుణం: రేవంత్ రెడ్డి

Revanth-Reddy mp

తాము ఫిర్యాదు చేసినా ఎన్నికల సంఘం కేసు పెట్టకపోవడం దారుణమైన విషయమని టీ- కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగిపోతుందంటూ ప్రజలను బ్లాక్ మెయిల్ చేసేందుకు కేటీఆర్ యత్నించారని ఆరోపించారు.

హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ లు మాట్లాడిన తీరు అదేవిధంగా ఉందని ఆరోపించారు. కేటీఆర్ సహా వీళ్ల పై ఎన్నికల అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? నోటీసు ఇచ్చి వివరణ ఎందుకు అడగలేదు? అని ప్రశ్నించారు.తన ఓటు ఎవరికి వేశారో ఆ విషయాన్నిబహిరంగంగా ప్రకటించిన గంగుల కమలాకర్ పై ఇప్పటి వరకు క్రిమినల్ కేసును ఎన్నికల నిర్వహణ అధికారులు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.

Related posts