ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి మధ్య నేడు జరగాల్సిన భేటీ వాయిదా పడింది. ఈ ఉదయం వీరిద్దరూ భేటీ కావాల్సి ఉండగా, అనివార్య కారణాల వల్ల భేటీని 14వ తేదీకి వాయిదా వేశారు. చిరంజీవి నటించిన “సైరా నరసింహారెడ్డి” సినిమా ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను చూసిన పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. జగన్ అపాయింట్మెంట్ కోరిన చిరంజీవి ఈ సినిమాను చూడాల్సిందిగా ఆహ్వానించేందుకే ఆయనను కలవబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కోరిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. నేటి ఉదయం 11 గంటలకు అపాయింట్మెంట్ ఖరారైంది. దీంతో చిరంజీవి తన కుమారుడు చరణ్తో కలిసి జగన్ను కలుస్తారని వార్తలు వచ్చాయి. అయితే నిన్న సాయంత్రం వీరి భేటీ వాయిదా పడినట్టు వార్తలు వచ్చాయి. అనివార్య కారణాల వలనే భేటీని ఈ నెల 14కు వాయిదా వేసినట్టు సమాచారం.
సుమలత ఫేస్బుక్ బ్లాక్.. కుమారస్వామిపై ఫైర్