telugu navyamedia
క్రీడలు వార్తలు

డబుల్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ…

ప్రస్తుతం ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే నిన్న ఈ జట్టు పంజాబ్ తో ఆడిన మ్యాచ్ తో కోహ్లీ 200 పూర్తి చేసుకున్నాడు. 2008 నుంచీ ఐపీఎల్ లో బెంగళూరు తరపున ఆడుతున్నకోహ్లీ నిన్న పంజాబ్‌తో ఆడిన మ్యాచ్ తో బెంగళూరు తరఫున 200వ మ్యాచ్‌ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒకే జట్టు తరఫున ఇన్ని మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఇప్పటివరకు ఈ జట్టుకు ఐపీఎల్ లో 185 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ.. ఛాంపియన్స్‌ లీగ్‌లోనూ బెంగళూరు తరఫున 15 మ్యాచ్‌లు ఆడాడు. దాంతో ఆ జట్టుతో డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో మొదట బ్యటింగ్ చేసిన ఆర్సీబీ జట్టులో కెప్టెన్ కోహ్లీ (48) అలాగే చివర్లో క్రిస్ మోరిస్ వచ్చి 8 బంతుల్లోనే 25 పరుగులు చేసాడు. దాంతో బెంగళూరు నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగ్గిన పంజాబ్ మొదటి నుండి విజయం వైపుకే పరుగులు తీసింది. జట్టు టాప్ ఆర్డర్ రాణించడంతో పంజాబ్ కేవలం రెండు వికెట్ మాత్రమే కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్ మయాంక్ (45) పరుగుల వద్ద ఔట్ అయిన తర్వాత కెప్టెన్ రాహుల్(61*) అలాగే గేల్ (53) అర్ధశతకాలతో రాణించారు. దాంతో పంజాబ్ ఈ ఐపీఎల్ లో రెండో విజయాన్ని నమోదు చేస్తూ బెంగళూరు మూడో ఓటమి చవిచూసింది..

Related posts