దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించిన రఘునందన్రావు… ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచందర్రావు, జితేందర్ రెడ్డి సహా పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. దుబ్బాక ఎన్నికల ఫలితం ఒక రెఫరెండంగా భావిస్తున్నామన్నారు.. దుబ్బాక గడ్డ మీద పోలీసులను ఎదుర్కొన్నాం .. సెర్చ్ నోటీసులు ఇవ్వకుండా ఇళ్లల్లో సోదాలు చేస్తారా…? అని ప్రశ్నించారు. దీనిపై పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. చట్టం తమ చుట్టం అని చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పోలీసు అధికారులు చేస్తున్నారని మండిపడ్డారు.. పోలీసులను ప్రజలు కొడితే గదే 324 కేసు మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించిన రఘునందన్… నా పంచాయతీ పోలీసులతో కాదు.. పోలీసు కమిషనర్తో మాత్రమే అన్నారు. మరో మూడేళ్లు కేసీఆర్ అధికారంలో ఉంటారని తెలిసి కూడా దుబ్బాక ప్రజలు నాకు ఓటు వేశారన్న బీజేపీ ఎమ్మెల్యే.. గ్రేటర్ పరిధిలో కూడా బీజేపీ కి ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా ప్రజలకు సూచించారు.
previous post
నేనే తప్పుచేశా..