కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన “కేజీఎఫ్” చిత్రం దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యువ హీరో యశ్ ప్రధాన పాత్రలో మూవీ రూపొందుతుంది. ఫస్ట్ పార్ట్లో అధీరా అనే పాత్రని సస్పెన్స్లో పెట్టిన మేకర్స్ ఆ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ని జూలై 29 విడుదల చేశారు. అధీరా పాత్రలో దత్తు భాయ్ అదరగొట్టారు. శ్రీనిధి శెట్టి చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. హోమ్బేల్ ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగాన్ని మించి యాక్షన్, మాఫియా ఉంటాయట. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో దుబాయ్ మాఫియాపై యష్ చేసే ఎదురుదాడులు సీక్వెల్లో హైలైట్ గా నిలవనున్నాయని అంటున్నారు. ఈ భారీ సీక్వెల్ను 2020 సమ్మర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా చిత్రయూనిట్ చాలా కాలం కిందటే ఎనౌన్స్ చేశారు. అందుకు తగ్గట్టుగా షూటింగ్ షెడ్యూల్స్ను కూడా ప్లాన్ చేశారు. కానీ భారీ చిత్రం కావటంతో భారీ స్టార్ కాస్ట్తో తెరకెక్కుతుండంతో షూటింగ్ అనుకున్న ప్రకారం ముందుకు సాగటంలేదు. దీంతో షూటింగ్ ఆలస్యమవుతోంది. అంతేకాదు నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు చిత్రయూనిట్. అందుకే ముందుగా అనుకున్నట్టుగా సమ్మర్లో కాకుండా సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. అలా అయితే షూటింగ్తో పాటు నిర్మాణానంతర కార్యక్రమాల విషయంలో కూడా ఎలాంటి హడావిడి లేకుండా పర్ఫెక్ట్గా సినిమాను ప్లాన్ చేయోచ్చని భావిస్తున్నారట. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా కేజీఎఫ్ 2 వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
previous post