రామ్ చరణ్ ప్రధాన పాత్రలో బోయపాటి శీను తెరకెక్కించిన మాస్ ఎంటర్టైనర్ “వినయ విధేయ రామ”. కైరా అద్వానీ కథనాయికగా నటించిన ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ స్నేహ ముఖ్య పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. డిజాస్టర్గా నిలిచిన చిత్రం కమర్షియల్గా కూడా పెద్దగా విజయం సాధించలేకపోయింది. “వినేయ విధేయ రామ” చిత్రం ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందగా, ఇందులోని యాక్షన్ సీన్స్ బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్నాయి. ఇప్పటి వరకు బుల్లితెరపై 8 సార్లు ప్రదర్శితమైన ఈ సినిమా తక్కువ టీఆర్పీ 5.19 కాగా, హై టీఆర్పీ 8.2. యావరేజ్గా 7.4 అని తేల్చారు. తాజాగా ప్రసారమైన ఈ చిత్రానికి 7.98 టీఆర్పీ రావడం విశేషం. లెక్కలని బట్టి చూస్తుంటే వినయ విధేయ రామ చిత్రం బుల్లితెర ప్రేక్షకులకి మాంచి కిక్ ఇస్తుందని అంటున్నారు.
previous post