telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త జీవితం మొదలైంది. మిరాకిల్ జరిగింది… : మాధవీలత

madhavi-latha comments

నటి మాధవీలత తాను చేసిన సినిమాల కన్నా వివాదస్పద వ్యాఖ్యలతోనే బాగా పాపులర్ అయ్యారు. ‘అతిథి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బళ్లారి బ్యూటీ.. ఆ తరవాత ‘నచ్చావులే’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ఈ సినిమా మినహా మాధవీలత నటించిన మరే సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇక సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల వైపు మళ్లారు. మొదట టీడీపీలో చేరారు. ఆ తరవాత బీజేపీకి మారారు. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. అయితే, అప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె ఫుల్ పాపులర్ అయిపోయారు. ఇక రాజకీయ నాయకురాలి అవతారం ఎత్తిన తరవాత మాధవీలత తన పాపులారిటీ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంపై సోషల్ మీడియాలో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. నాయకురాలు కూడా కావడంతో సామాజిక అంశాలపై సోషల్ మీడియా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. ఆ మధ్య చిత్రపురి కాలనీ సమస్యలపై, రాకేష్ మాస్టర్ వ్యవహారంపై, కరోనా వైరస్ వ్యాప్తి చెందడంపై, లిక్కర్ షాపులు ఓపెన్ చేయడంపై కామెంట్స్ చేశారు. అయితే, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాధవీలత ఒక పోస్ట్ చేశారు. ‘‘చాలా నెలల తరవాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం మొదలైంది. మిరాకిల్ జరిగింది. నేను ఎప్పుడూ మిరాకిల్స్‌ను నమ్ముతాను. చాలా చాలా చాలా సంతోషంగా ఉన్నాను. త్వరలోనే ప్రకటన చేస్తాను’’ అని మాధవీలత తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం మాధవీలతకు 31 సంవత్సరాలు. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉన్నారు. ఇక ఆమె లైఫ్‌లో జరిగిన మిరాకిల్ ఏముంటుంది? పెళ్లి తప్ప! కొత్త జీవితం కూడా ప్రారంభమైంది అంటున్నారు. కాబట్టి, ఇది కచ్చితంగా పెళ్లి గురించేనని అర్థమవుతోంది. అయితే, కొంత మంది ప్రేమ గురించి కూడా కావచ్చు కదా అని అంటున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే త్వరలో ఆమె చేయబోయే ప్రకటన గురించి వేచి చూడాల్సిందే.

Related posts