శర్వానంద్ హీరోగా 2010లో వచ్చిన “ప్రస్థానం” చిత్రాన్ని హిందీలోకి అనువదిస్తున్న విషయం తెలిసిందే. శర్వానంద్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలిచింది ప్రస్థానం. ఈ మూవీ గ్రామాలతో పాటు దేశంలో రాజకీయాలని డిఫరెంట్ లెవల్కి తీసుకెళ్లింది. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ దేవాకట్ట పొలిటికల్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని బాలీవుడ్ హీరో సంజయ్ దత్ హీరోగా హిందీలో “ప్రస్థానం” పేరుతో రీమేక్ చేశారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, మనీషా కోయిరాల, అమైరా దస్తూర్, అలీ ఫాజల్, సత్యజిత్ దుబే, చుంకీ పాండే ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా బాలీవుడ్లో సెప్టెంబర్ 20న విడుదలైంది. తెలుగులో ఈ సినిమా మౌత్ టాక్ తో భారీ వసూళ్లు సాధించింది. కానీ హిందీలో మాత్రం సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. సంజయ్ దత్ లాంటి పెద్ద హీరో నటంచినా కూడా ఆ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తుంటే షాక్ అవ్వక మానరు. శుక్రవారం అక్కడ రిలీజ్ అయిన ప్రస్థానం మూడు రోజులకు గాను కేవలం మూడు కోట్లు మాత్రమే రాబట్టింది. ఈ సినిమాతో బాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేస్తాడని భావించిన దేవకట్టా సత్తా చాటలేకపోయాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ చేతిలో నెట్ఫ్లిక్స్ వాళ్లు నిర్మిస్తున్న బాహుబలి సినిమా ప్రీక్వెల్ వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. కనీసం ఆ సిరీస్ తోనైనా దేవకట్టాకి క్రేజ్ వస్తుందేమో చూడాలి.
previous post
యువతితో డైరెక్టర్ బూతు చాటింగ్… అసలు జరిగిన కథ ఇదీ…!