పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న చిత్రం ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ‘ఉప్పెన’కు దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ప్లే, సంభాషణలను కూడా బుచ్చిబాబే అందించారు. తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల కావాల్సి ఉంది. కరోనా, లాక్డౌన్ కారణంగా ఇది జరగలేదు. ఇది ఇలా ఉండగా… ఈ సినిమా కూడా ఓటీటీలోనే విడుదల కానుంది. దాదాపు రూ. 18 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమాని నెట్ఫ్లిక్స్లో రిలీజ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. విడుదల తేదీపై త్వరలో ప్రకటన రానుంది. కాగా.. థియేటర్లు తెరుచుకున్నా సినిమాలను ఓటీటీలోనే రిలీజ్ చేయడానికే ఫిలిం మేకర్స్ మొగ్గుచూపుతున్నారు. థియేటర్లలో విడుదల చేస్తే… జనాలు వచ్చే పరిస్థితి ఇప్పట్లలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
next post