సినీనటుడు, కమెడియన్ బండ్ల గణేష్ ఇటీవల రాజకీయాల్లో హడావుడి చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బండ్ల గణేష్ తెలుగు తెరపైకి రీఎంట్రీ ఇచ్చాడు. మహేష్ నటిస్తున్న “సరిలేరు నీకెవ్వరు”లో కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన “సైరా” సినిమాపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. “తెలుగువాడి సత్తాను మరోసారి సినీ ప్రపంచానికి చాటిచెప్పిన మా సైరా అన్నకు పాదాభివందనం” అంటూ చిరంజీవిని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. అంతకు ముందు రామ్ చరణ్ పై కూడా బండ్ల ట్వీట్ చేశారు. “మళ్ళీ మీతో ఒక సినిమా తీసి ఆ సినిమాను బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రజల ముందు ఉంచాలని ఉంది. ఆ అవకాశం లిటిల్ బాస్ నాకు త్వరగా ఇవ్వాలని కోరుకుంటూ మీ బండ్ల గణేష్” అంటూ తన అభ్యర్ధనను తన ట్విట్ ద్వారా తెలిపారు బండ్ల గణేష్. గతంలో రామ్ చరణ్తో కలిసి బండ్ల గణేష్ “గోవిందుడు అందరివాడేలే” సినిమా తీశారు. ఈ నేపథ్యంలో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న బండ్ల గణేష్… “మరో ఛాన్స్ ఇవ్వండి లిటిట్ బాస్” అంటూ రామ్చరణ్ను ట్విటర్ వేదికగా రిక్వెస్ట్ చేశారు. మరి రామ్ చరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
previous post
next post
పవన్ కు కుదరలేదు కానీ… చిరంజీవి మాత్రం నా మీద పగ తీర్చుకుంటున్నాడు… : శ్రీరెడ్డి కామెంట్స్