telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంపీ అర్వింద్‌ గుండుపై కామెంట్‌ చేసిన ఎంపీ రేవంత్‌ రెడ్డి !

revanth shabbir ali

ఆర్మూర్ రాజీవ్ రైతు దీక్షలో ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్‌, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ధర్మపురి అర్వింద్‌ నువ్వు గుండు కొట్టించుకుంటే పర్వాలేదని…20 నెలలైనా పసుపు బోర్డు ఎందుకు తేలేదో చెప్పాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. పసుపు రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉందని.. నూతన వ్యవసాయ చట్టలతో దేశంలోని 80 కోట్ల రైతాంగం అందోళనలో ఉందని తెలిపారు. కేసీఆర్.. బిజెపి ఒత్తిళ్లకు తలొగ్గారని.. నిజమాబాద్ జిల్లా అంటే రైతాంగ జిల్లా అని పేర్కొన్నారు. పసుపు రైతులు ఆందోళనలో ఉంటే ఎంపీ అర్వింద్ ఎక్కడున్నాడని… పసుపునకి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పి రైతులను మోసం చేశారని ఫైర్‌ అయ్యారు. అర్వింద్ గెలిస్తే పసుపు బోర్డు ఇస్తామని రాంమాదవ్ మాటిచ్చారని.. అర్వింద్ బాండ్ రాసిచ్చి రైతులను మోసం చేసారని నిప్పులు చెరిగారు. గతంలో ఇలాగే వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన కవితని ఓడించారని… బోర్డు కోసం రైతులే స్వయంగా పార్లమెంటుకు పోటీ చేసారని గుర్తు చేశారు. అర్వింద్ వన్ టైం వండర్ లాంటోడని.. ఒకేసారి ఆయనకు అవకాశమని తెలిపారు. అర్వింద్ రాజకీయ భవిష్యత్ పసుపు బోర్డు, మద్దతు ధర తేవడం మీద ఆధారపడి ఉందన్నారు. అన్నింటి మీద మాట్లాడే బండి సంజయ్ కి నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు కనబడటం లేదా? అని నిలదీశారు. సోయిలేని తాగుబోతు ముఖ్యమంత్రి కేసీఆర్ అని.. వాస్తు పిచ్చికి ప్రభుత్వ డబ్బులు వృధా అయ్యాయని తెలిపారు. కేసీఆర్… మోడీకి లొంగిపోవటం వల్లే రాష్ట్ర రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts