telugu navyamedia
సినిమా వార్తలు

“ఫణి” బాధితులకు అక్షయ్ కుమార్ భారీ విరాళం

Akshay-Kumar

ఇటీవల వచ్చిన ఫణి తుఫాను కేరళలో తీవ్ర దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఫ‌ణి తుఫాను బాధితుల‌కు భారీ విరాళాన్ని అందించి అండ‌గా నిలిచారు. తుఫాను కార‌ణంగా తీవ్రంగా న‌ష్ట‌పోయిన ఒడిశా ప్ర‌జ‌ల‌కు భారీ విరాళం ప్రకటించారు. కోటి రూపాయ‌ల విరాళాన్ని ఒడిశా ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధికి పంపించి తన సహృదయాన్ని చాటుకున్నారు. గ‌తంలో కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో తుఫానులు సంభ‌వించిన‌పుడు కూడా అక్ష‌య్ భారీ విరాళాల‌ను ఇచ్చిన విషయం తెలిసిందే. ఫ‌ణి కార‌ణంగా తీవ్రంగా న‌ష్టపోయిన ఒడిశాకు ఇత‌ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్నాయి. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా స‌హాయం అందిస్తున్నారు.

Related posts