డైరెక్టర్ వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా హీరోగా “విరాటపర్వం 1992” పేరుతో ఓ విలక్షణ కథాంశం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి ముఖ్యపాత్రలో కనిపించనుంది. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షక లోకాన్ని ఫిదా చేసిన సాయి పల్లవి పుట్టిన రోజు మే 9. ఈ సందర్భంగా ఆమె తాజా సినిమా ‘విరాటపర్వం’ నుంచి సర్ప్రైజింగ్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
Happy birthday to the loveliest @Sai_Pallavi92 Wishing you have the best year yet ❤️ pic.twitter.com/WWQyeDmqUn
— Rana Daggubati (@RanaDaggubati) May 9, 2020
ఆమె రోల్ గతంలో ఎన్నడూ చూడని విధంగా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఆ వార్తలను నిజం చేసేలా ఆమెకు సంబంధించిన సర్ప్రైజింగ్ లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. మెరూన్ కలర్ లంగావోణీ ధరించి పక్కనే బ్యాగ్ పెట్టుకొని అడవిలో అమరవీరుల స్మారక చిహ్నం వద్ద కూర్చొని కనిపిస్తోంది సాయి పల్లవి. ఈ లుక్ చూస్తుంటే సాయి పల్లవి రోల్ చిత్రానికే ప్రధాన అసెట్ అని తెలుస్తోంది. మొత్తానికి ఆమె పుట్టినరోజున సినిమాపై హైప్ క్రియేట్ చేస్తూ సూపర్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా మరో వారం రోజుల షూటింగ్ పూర్తిచేయాల్సి ఉంది. పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నారు. సురేష్ బాబు, చురుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నందితా దాస్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి కూడా నటిస్తున్నారు.