telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నయీం, శశికళ బయోపిక్ లపై ఆర్జీవీ క్లారిటీ

Ram-Gopal-Varma

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. వివాదాస్పద సినిమాలు తీయడమే కాదు వరుసగా సినిమాలు ప్రకటిస్తుంటారు కూడా. అయిత్ వాటిలో కొన్ని సెట్స్ మీదకు వెళతాయి.. మరికొన్ని ప్రకటించిన దగ్గరే ఆగిపోతాయి. కరెంట్ ఇష్యూలను తీసుకుంటూ ఆయన చేసే ప్రకటనలకు ఇండస్ట్రీలో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అలాగే నయీం, శశికళ బయోపిక్ లు తీయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు ఆర్జీవీ. అయితే అవి విడుదలవుతాయా లేదా అనేదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఓ కార్యక్రమంలో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ… గతంలో తాను ప్రకటించిన సినిమాలు వస్తే వస్తాయని, లేదంటే రావని తేల్చి చెప్పారు. అనౌన్స్ చేసి… సినిమా చేయకపోవడం అంటే.. మాట మీద నిలబడకపోవడం కాదన్నారు. “అలా అనౌన్స్ చేసిన వాటిలో నయీం, శశికళ.. నాకు గుర్తులేనివి మరో పది ఉండొచ్చు. బేసిక్‌గా ఏంటంటే.. మనం ఒక ఐడియాను ఒకరిద్దరితో డిస్కస్ చేసినప్పుడు.. అవి అలా బయటకు వచ్చేస్తాయి. ఇంకో విషయం చెప్పాలంటే.. నేను తీసినన్ని సినిమాలు ఎవరూ చేయలేదు. ప్రకటించిన సినిమాలన్నీ టైమ్ వచ్చినప్పుడు విడుదల అవుతాయి. ఒక్కోసారి మూడ్ మారినప్పుడు వేరే సినిమా వైపు వెళిపోతుంటాను. ప్రొడ్యూసర్లు దొరక్క సినిమాలు చేయడం లేదనేది వాస్తవం కాదు. ప్రస్తుతం నా చేతిలో మూడు సినిమాలు, మూడు వెబ్ సిరీస్‌లు ఉన్నాయి’’ అంటూ క్లారిటీ ఇచ్చారు.

Related posts