telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

2022 లో జమిలి ఎన్నికలు : గల్లా జయదేవ్

Galla Jayadev tdp

టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలు త్వరలోనే వస్తున్నాయని అన్నారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా తెనాలి శ్రవణ్ కుమార్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా ఎంపీ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు జరుగుతాయనే చర్చ నడుస్తోందని గల్లా జయదేవ్ అన్నారు. అందుకే 2022 లో ఎన్నికలు జరుగుతాయని మనం సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. న్యాయం, ధర్మం మనవైపే ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయమని ఆశ భావం వ్యక్తం చేశారు గల్లా జయదేవ్. ప్రజా ప్రతినిధులపై విచారణ వేగవంతం చేయడంతో సీఎం జగన్ లో ఆందోళన పెరిగిందని..అందుకే న్యాయ వ్యవస్థ విశ్వనీయతను దెబ్బతీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక వేళతాను జైలుకు వెళ్లినా ప్రజల నుంచి సానుభూతి పొందేందుకు సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నాడని గల్లా జయదేవ్ పేర్కొన్నారు.

Related posts