telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అమ్మకానికి జగనన్న కాలనీలు..

ఇంటిస్థలాలకు పెరిగిన డిమాండుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి…. జగనన్న కాలనీలను ఏర్పాటుచేసి అమ్మకానికి పెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు పరిటాల శ్రీరామ్ ధ్వజమెత్తారు.

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలో తెలుగుదేశం పార్టీ గౌరవ సభలో లో పాల్గొన్న పరిటాల శ్రీరామ్
ధర్మవరం MLA కేతిరెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజానీకాన్ని ముప్పుతిప్పలు పెట్టేకంటే ఎమ్మెల్యే కబ్జా స్థలాలను అమ్మి వన్ టైమ్ సెటిల్ మెంటు పథకానికి వినియోగించాలన్నారు.

వైసీపీ ప్రభుత్వానికి పరిటాల శ్రీరామ్ ఓపెన్ ఛాలెంజ్..నిరూపించు చూస్తా అంటూ |  Paritala Sriram open challenge to the YCP government to prove insider  trading - Telugu Oneindia

తెలుగుదేశం ప్రభుత్వం ఇండస్ట్రీయల్ పార్కుల అభివృద్ధి పేరుతో ప్రభుత్వ స్థలాలను సేకరిస్తే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ నాయకులు ఆ స్థలాలను కబ్జా చేసి జగనన్న కాలనీలు అనే పేరు పెట్టి అమ్మేసుకుంటున్నారని ఆరోపించారు.

Related posts