telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కంగనా వివాదాస్పద చిత్రానికి రచయితగా విజయేంద్రప్రసాద్

KAngana-Ranauth

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరో సంచలనానికి తెరతీయబోతున్నారు. ‘అయోధ్య రామమందిరం’పై సినిమా చేసేందుకు ఆమె చాలా ఆసక్తిగా ఉన్నారు. ‘అపరాజిత అయోధ్య’గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తెలుగు రచయిత, దర్శకధీరుడు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇప్పటికే కథ సిద్ధం చేస్తున్నారు. కంగన సొంత నిర్మాణ సంస్థ ‘రాణీ ఆఫ్ ఝూన్సీ’లోనే ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది నుంచి ఈ సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఇక సినిమాపై కంగన రనౌత్ వివరణ ఇచ్చారు. వందల ఏళ్లుగా ‘అయోధ్య ’ కీలక అంశంగా ఉందన్నారు. అయోధ్య కేసు దేశ రాజకీయాలను మార్చేసిందని చెప్పారు. లౌకిక స్ఫూర్తిని ప్రతిబింబించేలా ‘అయోధ్య’ వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చరిత్రగా నిలిచిందన్నారు. నాస్తికుడు భక్తుడిగా ఎలా మారాడన్నదే ఈ ‘అపరాజిత అయోధ్య’ చిత్ర కథాంశమని చెప్పారు. తన నిర్మాణ సంస్థలో తెరకెక్కించబోయే తొలి చిత్రం కూడా ఇదేనని కంగన పేర్కొన్నారు.

Related posts