మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళం తెలుగు రీమేక్ ఇది. ఇందులో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోండగా తమన్నా హీరోయిన్గా నటిస్తోంది.
మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహాశివరాత్రి కానుక వచ్చేసింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ను మహా శివరాత్రి సందర్భంగా ‘వైబ్ ఆఫ్ భోళా’ పేరుతో చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చిరు స్టైల్గా జీపుపై కూర్చొని ..త్రిశూలం తిప్పుతూ.. ఊర మాస్ లుక్లో చిరంజీవి అదరగొట్టేశాడు.
చిరంజీవి నుంచి అభిమానులు కోరుకునే అన్ని హంగులతో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. అన్నాచెల్లెల అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో రూపొందుతోన్న చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్లో చిత్రీకరణ జరుపుకొంటోంది. ఇందులో భాగంగా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం” అని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఈ సినిమాలో రఘుబాబు, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.