మొట్టమొదటి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన భారీ పీరియాడిక్ చిత్రం “సైరా నరసింహారెడ్డి” విడుదలయ్యి నేటితో ఏడాది పూర్తయ్యింది. దీనితో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైరా జర్నీను గుర్తు చేసుకున్నారు. “బెస్ట్ ఎక్స్ పీరియన్స్”, “బెస్ట్ క్యాస్టింగ్”, ఒక బ్రిలియంట్ టీం తో చేసిన ఈ చిత్రానికి ఏడాది పూర్తయ్యిందని ఈ ఐకానిక్ చిత్రం జర్నీను గుర్తు చేసుకుని తన టీం అంతటికీ స్పెషల్ థాంక్స్ తెలిపారు. గత ఏడాది ఇదే రోజున గాంధీ జయంతి సందర్భంగా ఈ అక్టోబర్ 2 వీక్ డే లోనే విడుదలైన ఈ చిత్రం మిశ్రమ స్పందనను రాబట్టుకుంది. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అద్భుతమైన విజువల్స్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి మెగా తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వహించి బడ్జెట్ పరంగా ఎక్కడా తగ్గకుండా అత్యున్నత ప్రామాణికాలతో తెరకెక్కించారు. మెగాస్టార్ చిరంజీవి డ్రీం రోల్ గా నటించిన ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం మరో విశేషం.
Best EXPERIENCE !!
Best CAST!! &
A BRILLIANT team!!
A year since #SyeRaa released.
Thank you one and all.@SrBachchan @KChiruTweets @DirSurender #Nayanthara @KicchaSudeep @VijaySethuOffl @IamJagguBhai @ravikishann @tamannaahspeaks @KonidelaPro #MahatmaGandhi pic.twitter.com/dQJcR5rVRA— Ram Charan (@AlwaysRamCharan) October 2, 2020
విజయ్పై బిగ్బాస్ బ్యూటీ కాపీ ఆరోపణలు