*వరంగల్లో విద్యార్ధి గొంతు కోసిన ప్రేమోన్మాది..
*కత్తితో గొంతు కోసిన అజహర్..
వరంగల్ వరంగల్ జిల్లా నర్సంపేటలోని దారుణం చోటుచేసుకుంది. కాకతీయ యూనివర్శిటీలో ఎంసీఏ చదువుతున్న యువతిని ప్రేమోన్మాది గొంతు కోశాడు.
లక్నేపల్లికి చెందిన అనూష కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంసీఏ చివరి సంవత్సరం చదువుతోంది. ఆమె చుట్టూ కొంతకాలంగా ప్రేమ పేరుతో తిరుగుతూ వేధిస్తున్న అజహర్. .అమ్మాయి ప్రేమను అంగీకరించలేదని కక్ష పెట్టుకున్నాడు.
శుక్రవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేరనే విషయం తెలుసుకొన్న అజహర్ యువతి ఇంట్లోకి వెళ్లి తనను ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో తన వెంట తెచ్చుకొన్న కత్తితో అనూష గొంతు కోశాడు. ఈ విషయం తెలుసుకొన్న స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం యువతి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ముగ్గురు వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచుతామని ఎంజీఎం వైద్యులు వెల్లడించారు.
ఈ ఘటనపై స్థానికులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితు అజహర్ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.