*వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేసిన సీఎ జగన్
*తమది మహిళా పక్షపాతి ప్రభుత్వం…
*ప్రభుత్వ పథకాలకు దుష్ట చతుష్టయం జీర్ణించుకోలేకపోతుంది
*రాష్ట్రంలో రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం..
*చరిత్రలో నిలిచిపోయే అక్కచెల్లెమ్మల విజయగాథ ఇది
ప్రకాశం జిల్లా ఒంగోలులో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద మూడో విడత నిధులను ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఒంగోలు నిర్వహించిన సభలో జగన్ పాల్గొన్నారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు .
సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. జగన్ పాలన వద్దంటూ.. చంద్రబాబు పాలనే కావాలని దుష్టచతుష్టయం అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దత్తపుత్రుడు కూడా అదే చెబుతున్నారని పవన్ కల్యాణ్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.
ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసమంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇకపై ఆ పథకాలు ఆపాలంటున్నారన్నారు.చంద్రబాబులా మోసం చేస్తే ఏపీ అమెరికా అవుతుందట… రాక్షసులు, దుర్మార్గులతో మనం యుద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. . ఏపీ మరో శ్రీలంకలా మారుతుందని విష ప్రచారం చేస్తున్నారని అన్నారు.
మంచి జరుగుతుంటే జీర్ణించుకోలేని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది. దుష్టచతుష్టయం కడుపు మంటతో ఉంది. మహిళల్ని గత ప్రభుత్వం నట్టేట ముంచింది. సున్నా వడ్డీ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. మహిళలకు రూ. 3,036కోట్లు ఇస్తామని ఎగనామం పెట్టిందని అన్నారు..
తమ ప్రభుత్వం 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఇప్పటివరకు మొత్తం వడ్డీ కింద రూ. 3615 కోట్లు చెల్లించినట్టుగా సీఎం జగన్ చెప్పారు. తమది మహిళా పక్షపాత ప్రబుత్వమని సీఎం జగన్ చెప్పారు.
.
సీఎం జగన్ ఫ్యాక్షన్ నేతగా వ్యవహరిస్తున్నారు: గోరంట్ల