telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

డ్రగ్స్ తీసుకున్న 17 నెలల బిడ్డ… తరువాత…

Kid

స్పెయిన్‌లో తినే పదార్థం అనుకుని డ్రగ్స్ తీసుకోవడం వల్ల 17 నెలల పసిబిడ్డ కోమాలోకి వెళ్లిపోయిన అమానుష సంఘటన చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం 3 గంటలకు బిడ్డకు మూర్ఛ రావడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బిడ్డను ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు వెంటనే బిడ్డను ఐసీయులో చేర్చి చికిత్స పెట్టి, మూత్ర పరీక్ష చేయగా, బిడ్డ డ్రగ్స్ తీసుకోవడం వల్లే మూర్ఛ వచ్చిందని గుర్తించారు వైద్యులు. ప్రస్తుతం కోమాలో ఉందని తెలిపారు. అనంతరం వైద్యులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆసుపత్రికి వచ్చి తల్లిదండ్రులిద్దరినీ అరెస్ట్ చేశారు. పసిబిడ్డను జాగ్రత్తగా చూసుకోనందుకు, ఇంట్లో డ్రగ్స్ ఉన్నందుకు గాను వారిపై కేసు నమోదు చేశారు. మరోపక్క తినే పదార్థం అనుకుని బిడ్డ డ్రగ్స్ తనంతట తానే తీసుకున్నాడా లేదా తల్లిదండ్రులే బిడ్డకు ఇచ్చారా అనేది తెలియాల్సి ఉంది.

Related posts