telugu navyamedia
క్రైమ్ వార్తలు

మాదాపూర్‎లో మ‌ద్యం మ‌త్తులో బైక్‌ను ఢీకొట్టి సెల్లార్‌లోకి దూసుకెళ్లిన కారు..

హైద‌రాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నా  కూడా మందు బాబుల్లో మార్పులు రావ‌డం లేదు..

మాదాపూర్ సాయి నగర్ లో ఆదివారం నాడు తెల్లవారుజామున కారు అతి వేగంగా నడుపుతూ బైక్‌ను ఢీకొట్టి సెల్లార్‌లో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. హరికృష్ణ మద్యం మత్తులో కారు డ్రైవింగ్ చేసినట్లు పోలీసు తెలిపారు

మ‌ద్యం మ‌త్తులో కారును నడిపిన వ్యక్తిని హరికృష్ణగా గుర్తించారు. హరికృష్ణ మాదాపూర్ అయ్యప్ప సోసైటీకి చెందినవాడుగా పోలీసులు తెలిపారు. 

 

 

Related posts