గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై ఎల్బీ నగర్ ఎస్ఓటీ ఇన్సిపెక్టర్ రవికుమార్ ఆధ్యర్యంలో దాడులు చేశారు. హైదరాబాద్ సరూర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని పీ అండ్ టీ కాలనీలో నిర్వహించిన ఈ దాడుల్లో వ్యభిచార గృహ నిర్వాహకుడు సహా ఇద్దరు కస్టమర్లు, మరో ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
వారి వద్ద నుంచి 3 సెల్ఫోన్లు, 22 కండోమ్ ప్యాకెట్లు, 11,900 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం చేస్తున్న మహిళలు తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రికి చెందిన వారిగా పోలీసులు నిర్థారించారు. వ్యభిచార గృహ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.