తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తండ్రి కుమారి అనంతన్ (86)కు సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో సోమవారం వైద్య పరీక్షలు నిర్వహించారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న ఆయనను ఆసుపత్రిలోని ఈఎన్టీ వైద్యులు పరీక్షించారు. ఈఎన్టీ చీఫ్ ప్రొఫెసర్ శోభన్బాబు, డిప్యూటీ సూపరింటెండెంట్ నర్సింహారావు ఆధ్వరంలో అనంతన్కు ఎండోస్కోపీ చేసి కర్ణభేరిని పరిశీలించారు. వినికిడి శక్తి తగ్గడానికి వయసు మీద పడడమే కారణమని వైద్యులు తెలిపారు.
చంద్రబాబు వల్లే తెలంగాణ ఉద్యమం: మంత్రి అవంతి