telugu navyamedia
రాజకీయ వార్తలు

మరో కేంద్ర మంత్రికి కరోనా…

ప్రస్తుతం మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ నడుస్తునా విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా రోజు వారి కేసులు రెండు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. అయితే ఈ సెకండ్ వేవ్ లో చాలా మంది రాజకీయనాయకులు కరోనా బారిన పడుతున్నారు. ఇవాళ కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడ‍్యూరప్పకు కూడా పాజిటివ్‌గా తేలింది.. తాజాగా కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కూడా కోవిడ్ బాధితుల లిస్ట్‌లో చేరిపోయారు.. త‌న‌కు మ‌హ‌మ్మారి సోకిన విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తానే స్వ‌యంగా వెల్ల‌డించారు ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్.. ఇవాళ నిర్వ‌హించిన కోవిడ్ టెస్ట్‌ల్లో త‌న‌కు పాజిటివ్‌గా తేలింద‌ని.. గత రెండు మూడు రోజుల నుంచి తనను కలిసిన వారు తప్పనిసరిగా కోవిడ్‌ టెస్ట్ చేసుకోవాల‌ని సూచిస్తూ ట్వీట్ చేశారు.

Related posts