అత్యాచార బాధితిరాలి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తున్న ప్రియాంక గాంధీతో పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆఖరికి ఓ బీజేపీ మహిళ నాయకురాలు కూడా దీనిపై భగ్గుమన్నారు. ఓ మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి ఆ పోలీసు అధికారికి ఎంత ధైర్యం అని ప్రశ్నించారు మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్రా కిషోర్ వాగ్.
ట్విట్టర్ వేదికగా ఆమె ఈ కామెంట్స్ చేశారు. భారత సంస్కృతి, సంప్రదాయాలపై విశ్వాసం గల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్… ఈ ఘటనపై తీవ్రంగా స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, పోలీసులు తమ పరిమితులు తెలుసుకుని ప్రవర్తించాలన్నారు చిత్రా కిషోర్ వాగ్. ఇదిలా ఉంటే, ప్రియాంకతో అనుచిత ప్రవర్తనపై యూపీ గౌతమ్ బుద్ధ్ నగర్ పోలీసులు ఇప్పటికే స్పందించారు. ప్రియాంక గాంధీకి క్షమాపణలు తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు.
రాజకీయాల్లోకి మాస్ లీడర్లను తీసుకొస్తా: పవన్ కల్యాణ్