telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్ కిషోర్ మ‌రోసారి భేటీ..

దేశ‌రాజ‌కీయాల‌కు కేంద్రంగా హైద‌రాబాద్‌..
కేసీఆర్‌తో ప్ర‌శాంత్ కిషోర్ భేటి..
కేసీఆర్ ప్ర‌శాంత్ కిషోర్ భేటిపై జాతీయ‌రాజ‌కీయాల‌పై చ‌ర్చ‌

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఆదివారం టీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.

కాంగ్రెస్‌ అధిష్ఠానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో వరుస భేటీలు అయిన ప్రశాంత్ కిషోర్  టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం జాతీయ‌ రాజకీయాల వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ భేటీలో తెలంగాణ రాజకీయాలతో పాటు జాతీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. నిన్న చాలా గంటలల పాటు సుదీర్ఘంగా ప్రశాంత్ కిషోర్, కేసీఆర్ ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్ కార్యచరణపై చర్చించారు.

రాత్రి ప్రగతి భవన్‌లోనే ప్రశాంత్ కిషోర్ బస చేశారు,  నేడు మరో సారి వీరిద్దరు సమావేశం కానున్నారు. ఇందులో భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌, ఇత‌ర రాజ‌కీయ‌ప‌ర‌మైన ముఖ్య అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Related posts