telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో దారుణం : అత్తకు కరోనా.. కోడలిని కౌగిలించుకుని మరీ..!

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 2524 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే 24 గంటల్లో 18 మృతి చెందారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 578351 కి చేరుకుంది. ఇది ఇలా ఉండగా రాజన్న సిరిసిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ అత్త తనకు కరోనా వచ్చిందని కోడలికి కూడా అంటించింది. ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు గెంటేసింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ కు చెందిన ఓ మహిళకు కామారెడ్డి జిల్లాలోని నేమిలీగుత్త తండా వాసితో మూడేళ్ళ కింద పెళ్లి అయింది. ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. భర్త ఉపాధి కోసం 7 నెలల కింద ఒడిశా వెళ్ళాడు. అక్కడే ట్రాక్టర్ డ్రైవరు గా పని చేస్తున్నాడు. అయితే 5 రోజుల కింద ఏ అత్తకు కరోనా సోకింది. దీంతో అత్త హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందుతోంది. కోడలు సామాజిక దూరం పాటించడాన్ని అత్త భరించలేకపోయింది, ఇంకేముంది తన శాడిజం చూపింది. కోడలిని తరచూ కౌగిలించుకుంది. దీంతో ఆ కోడలికి కూడా కరోనా సోకింది. అంతే కాదు చిన్న పిల్లలు ఉన్నారనే కనికరం కూడా చూడకుండా ఆమెను బయటకు నెట్టేశారు. ఈ దారుణాన్ని గ్రహించిన గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కోడలు, అత్త హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

Related posts