తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడ పరిధిలోని రహదారి, రిజర్వాయర్ శంకుస్థాపనకు ఆర్థిక మంత్రి హరీష్ వచ్చారు. ఈనేపథ్యంలో కార్యకర్తలు, స్థానిక నాయకులతో కలిసి ఆయన బైక్లపై ర్యాలీగా వెళుతున్నారు.
మార్గమధ్యలో బీరంగూడ కమాన్ దాటుతుండగా ఆర్టీసీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మంత్రి హరీష్ రావు ఎదుట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు పలువురు ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేసి రామచంద్రాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు.