telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించాం: స్పీకర్ తమ్మినేని

ap speaker tammineni

శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ సెంబ్లీ చేసిన తీర్మానంపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి పంపించామన్నారు. అన్నీ చట్టం ప్రకారమే జరుగుతాయన్నారు. చట్టం ఏ ఒక్కరికీ చుట్టం కాదన్నారు.

ఎన్టీఆర్ హయాంలోనూ మండలి రద్దు జరిగింది. ఓపక్క రాజధాని ప్రాంత రైతులతో ప్రభుత్వం వేసిన కమిటీ చర్చిస్తోంది. రైతులతో పాటు రైతు కూలీలకు కూడా పెన్షన్ ఇస్తామని సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఉద్యమాల గురించి నేను మాట్లాడను. నిజంగా ప్రజాఉద్యమం కనుక జరిగితే అందరం మద్దతిద్దామన్నారు.

Related posts