telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ లోయలో తీవ్ర ఉద్రిక్తత..భయపడాల్సిన అవసరం లేదు: గవర్నర్

Governor twitter account hacked

ఉగ్రదాడులు జరగనున్నాయనే ముందస్తు సమాచారంతో అమర్ నాథ్ యాత్రికులను వెనక్కి పంపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కశ్మీర్ లోయలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తన వద్దకు వివిధ పార్టీలకు చెందిన నేతలను పిలిపించుకున్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా వారికి చెప్పారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని, పుకార్లను నమ్మొద్దని రాజకీయ నేతలకు ఆ రాష్ట్ర గవర్నర్ సూచించారు. గవర్నర్ ను కలిసిన వారిలో మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, షా ఫైసల్, సజ్జాద్ లోనీ, ఇమ్రాన్ అన్సారీ తదితరులు ఉన్నారు.

ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఉందని ఈ సందర్భంగా సత్యపాల్ మాలిక్ తెలిపారు. అయితే, ఉగ్రవాదుల అంశాన్ని ఇతర అంశాలతో ముడిపెడుతూ పుకార్లను ప్రచారం చేస్తూ, భయాందోళనలకు గురి చేస్తున్నారని చెప్పారు. మరోవైపు, జమ్ముకశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులను కల్పిస్తున్న ‘ఆర్టికల్ 35 ఎ ను కేంద్రం రద్దు చేయబోతోందని… అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా వేలాది సాయుధ బలగాలను లోయలోకి పంపుతోందనే ఆందోళన అక్కడి ప్రజల్లో నెలకొంది.

Related posts