ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఢిల్లీలో సీఈసీ అరోరాను కలుసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల్లోకి ఏజెంట్లు ఎలాంటి పత్రాలు తీసుకురావొద్దని రిటర్నింగ్ అధికారులు చెప్పడం సరికాదని కనకమేడల అభిప్రాయపడ్డారు.
వీవీప్యాట్ల లెక్కింపుతో ఆలస్యం అవుతుంది కాబట్టి భోజన సదుపాయాలు కల్పించాలని కోరారు. ఏజెంట్లను మధ్యలో బయటకు పంపించొద్దన్నారు. ఓట్ల లెక్కింపు రోజున సీలింగ్ ఉన్న ఈవీఎంలను మరోసారి లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 23న కౌంటింగ్ కేంద్రాల వద్ద వైసీపీ శ్రేణులు అలజడులు సృష్టించే అవకాశముందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరారు.
ఐదేళ్లుగా గుర్తుకురాని అవినీతి ఇప్పుడే గుర్తొచ్చిందా?