telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అనుమానం అవసరం లేదు.. నూటికి వెయ్యిశాతం టీడీపీ గెలుస్తుంది: చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల పై స్పందించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూటికి వెయ్యిశాతం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఎవరికీ అనుమానం అవసరంలేదన్నారు. అందుకుఉదాహరణలు చాలా ఉన్నాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా సర్వేలు చేయడం సహజమని అన్నారు. టీడీపీ కూడా 1983 నుంచి సర్వేలు చేసిందని అన్నారు.

ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తాను పిలిపునిస్తే ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి క్యూ లైన్లలో నిలుచున్నారని చెప్పారు. ఈవీఎంలు పనిచేయకపోయినా రాత్రయినా తెల్లవారుజామువరకు లైన్లలో ఉండి ఓట్లు వేశారని, ఇంతకంటే ఉదాహరణ ఇంకేమికావాలని చంద్రబాబు అన్నారు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు రద్దు చేసినా, రైళ్లలో రిజర్వేషన్లు లేకపోయినా ఏదో ఒక వాహనంలో బయలుదేరి ఓటు హక్కును వినియోగించుకున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

Related posts