అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు కచ్చితంగా హాజరు కావాల్సిందేనని సీబీఐ కోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆయన హైద్రాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టు కు హాజరు కాలేదన్న విషయం విధితమే.
ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ తెలంగాణ హైకోర్టులోజగన్ పిటిషన్ వేశారు. సీఎంగా ప్రతి నిమిషం రాష్ట్రం కోసం కేటాయించాల్సి ఉందని పిటిషన్లో జగన్ పేర్కొన్నారు. తనకు బదులుగా సహ నిందితులు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.