telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అలా చేస్తే మనకి, పశువులకి తేడా ఉండదు… కొరటాల శివ అసహనం

koratala

కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానానికి వచ్చేసింది. అయినప్పటికీ కూడా ప్రజలు ఏమాత్రం భయం లేకుండా, కనీసం మాస్కులు కూడా ధరించకుండా బయట తిరుగుతున్నారు. ఈ విషయమై దర్శకుడు కొరటాల శివ తన ట్విట్టర్‌లో అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఇంత చెప్తున్నా మాస్కులు వేసుకోకుండా తిరిగితే బొత్తిగా మనకి, పశువులకి తేడా ఉండదు. ఈ వ్యాధి వ్యాప్తి తగ్గాలంటే ప్రస్తుతానికి అదొక్కటే మార్గం. దయచేసి మాస్కులు వేసుకుందాం(ముక్కు, మూతి కవరయ్యేలాగా. మెడ మీద కాదు). వేసుకోని వాళ్లకు పనిమాల చెబుదాం..’’ అని కొరటాల శివ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Related posts