పోలీసులకు ఆధారాలు దొరకకూడదనే భయంతో ఓ దొంగ 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగాడు. ఆ దొంగ మింగిన బంగారు ఉంగరాలను ఆపరేషన్ చేసి డాక్టర్లు బయటికి తీశారు. ఈ సంఘటన కర్ణాటకలోని సుళ్య పోలీస్స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మార్చి చివర్లో సుళ్య పాత బస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ. 50 వేలు నగదు దోచుకెళ్లారు. ఈ కేసులో ఐదు రోజుల కిందట తంగచ్చయన్ మ్యాథ్యూ, శిబు అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే దొరికిపోతాననే భయంతో.. శిబు తన వద్ద గల 35 గ్రాముల ఉంగరాలను మింగేశాడు. అతనికి కడుపు నొప్పి రావడంతో పోలీసులు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఎక్స్రే తీయగా కడుపులో ఉంగరాలు ఉన్నట్లు తేలింది. దీంతో అతని పొట్ట కోసి 25 చిన్న, చిన్న ఉంగరాలను తీశారు వైద్యులు. ప్రస్తుతం ఆ దొంగ కోలుకుంటున్నాడు.
previous post
రణు మొండల్ పై వెల్లువెత్తుతున్న విమర్శలు… స్పందించిన కుమార్తె