telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియా చక్రవర్తి నా బిడ్డకు విషం ఇచ్చింది.. సుశాంత్ తండ్రి

Sushanth

బాలీవుడ్‌ దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో రోజుకో షాకింగ్ విషయం బయటపడుతోంది. సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్ల నగదు నటి రియా చక్రవర్తి ఖాతాలోకి బదిలీ అయినట్లు సుశాంత్ తండ్రి ఆరోపించారు. సీబీఐ, మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ఈడీ రియాను విచారిస్తోంది. ఇప్పటికే సీబీఐ సుశాంత్ స్నేహితుడు, సుశాంత్ పనిమనిషిని విచారించి పలు విషయాలను రాబట్టింది. తాజాగా ఈ కేసులో మాదకద్రవ్యాల కోణం బయటపడింది. దీనితో సుశాంత్ తండ్రి కేకే సింగ్ స్పందిచారు. తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన ఆయన రియా చక్రవర్తి తన కుమారుడిని చంపిన హంతకురాలని, చాలా రోజులుగా రియా చక్రవర్తి తన బిడ్డకు విషం ఇచ్చిందని, ఆమె ఒక హంతకురాలని, ఆమెను, ఆమె అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts